జిల్లాలోని ఆయా గ్రామ పంచాయితీల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు రైతుల పొలాలను అద్దెకు తీసుకొని నర్సరీలు ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు బోరు బావులు, నీటి సదుపాయం కలిగిన రైతుల పొలాలను ఎంపిక చేశారు. మొక్కల పెంపకానికి మట్టి, ఇతర సామగ్రి రైతుల నుంచే సమీకరిస్తున్నారు. అద్దెల భారం తగ్గించుకునేందుకు గ్రామ కంఠం, ప్రభుత్వ స్థలాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధిహామీ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు నాటి.. వాటి నిర్వహణను రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తున్నారు.


