జిల్లాలో రైతులు కేవలం వరి, పత్తికే పరిమితం కాకుండా కందులు, జొన్న, నువ్వులు, వేరుశనగ, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలి. ఈ పంటలు తక్కువ నీటితో సాగవడంతోపాటు మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశం ఉంది. భూసార పరీక్షలు చేయించుకొని, మట్టి ఆరోగ్య కార్డు సూచనల మేరకు ఎరువులు వినిగియోగిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుంది. వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపడితే రైతులు మెరుగైన ఆదాయం పొందగలరు. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●


