నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సహకరిస్తే సేవలందించాలనే సంకల్పంతో శేషగిరిరావు తదితరులతో కలిసి ఫౌండేషన్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులకు, పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తున్నాం. చదువుకునే లక్ష్యానికి పేదరికం అడ్డు కాకూడదని తాము విద్యార్థులకు చెబుతుంటాం.వారికి ఏ సహాయం కావాలన్నా సహకరిస్తున్నాం. పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు దాతలు ఉంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఫౌండేషన్ సహకారం అందిస్తుంది.
– వాసుదేవ్,
స్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు


