మాజీ సైనికుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ డైరెక్టర్‌, బ్రిగేడియర్‌ ఎన్‌ఆర్‌ బాబు అన్నారు. సోమవారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్‌ను 2 నుంచి 5 ఏళ్లు పెంచాలని మాజీ సైనికులు అడుగుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సైనిక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్‌, ఎమ్మార్కే రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, రాములు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement