టేకులపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామ పరిధి గుడితండాకు చెందిన బానోతు సక్రు (70) ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన అల్లుడు, టేకులపల్లికి చెందిన గుగులోత్ కిషన్ ఆదివారం తెలిపారు. కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు చీమలపాడు స్టేషన్లో ఎక్కినట్లు తెలుస్తుండగా, ఆ తర్వాత సక్రు ఆచూకీ తెలియరాలేదని వెల్లడించాడు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 79934 48485, 83415 21726 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కిషన్ కోరాడు


