బస్సు, బైక్‌ ఢీ.. బైకిస్టు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు, బైక్‌ ఢీ.. బైకిస్టు మృతి

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిలుమెహళ్లి తాండా సమీపంలో బస్సు, బైక్‌ మధ్య జరిగిన ప్రమాదంలో బైక్‌ చోదకుడు కరిబసప్ప (65) మృతి చెందగా, వెనుక కూర్చొన్న సదాశివకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకాలోని మట్టజనహళ్లికి చెందిన కరిబసప్ప, సదాశివ వ్యక్తిగత పనిపై కూడ్లిగి తాలూకాలోని అప్పేనహళ్లి తాండాకు వచ్చి తమ గ్రామానికి తిరిగి వెళ్తుండగా స్వాగత కమాను సమీపంలో మట్టజనహళ్లి వైపు నుంచి సండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. బైక్‌ నడుపుతున్న కరిబసప్ప అక్కడికక్కడే మరణించగా, వెనుక కూర్చొన్న సదాశివ గాయపడ్డాడు. మృతుడు కరిబసప్ప కుమారుడు ఉపేంద్రకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడేకోటె పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సుబ్రహ్మణ్య తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement