శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

హొసపేటె: రోడ్డు కోత వల్ల లేదా భారీ వాహనాల రద్దీ వల్లో కానీ విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో హొసహళ్లి–జుమ్మోబనహళ్లి రోడ్డు మధ్యలో చిన్న చిన్న గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోజూ ప్రయాణించే బైకర్లు ప్రమాదాలకు గురై గాయపడ్డారు. అంతేకాకుండా జనవరిలో రోడ్డుకు ప్యాచ్‌ వేసినప్పటికీ రోడ్డు మళ్లీ పాడైపోయి గుంతలతో నిండిపోయింది. దీంతో గమనించిన జుమ్మోబనహళ్లికి చెందిన మలియమ్మ దేవి స్నేహితర బళగ ప్రజలకు, బైకర్లకు సురక్షితమైన రాకపోకలను కల్పించడానికి ఆదివారం నుంచి ట్రాక్టర్లతో గుంతల్లో మట్టి వేసి మరమ్మతులు చేసే పనులను స్వయంగా శ్రమదానం చేయడం ద్వారా పనులు ప్రారంభించారు. సామాజిక స్పృహతో గుంతలను పూడ్చే పనిని చేపట్టిన స్నేహితర బళగ సేవలను జుమ్మోబనహళ్లి జీపీ మాజీ సభ్యుడు జే.మెసరహట్టి ప్రశంసించి మాట్లాడుతూ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడానికి వారు స్వచ్ఛందంగా ట్రాక్టర్‌తో మట్టిని తోలించారని తెలిపారు.

స్వచ్ఛందంగా గుంతలు పూడ్చిన స్నేహితర బళగ బృందం సభ్యులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement