రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందడుగు వేయాలని జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున పేర్కొన్నారు. తాలూకాలోని శ్రీరామనగర క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు నలి కలి పాఠ్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ భండారి, ఉపాధ్యాయులు మహంతేష్, తాయప్ప, నారాయణ, గీతా రాణి, రమేష్, జంగ్లప్ప, నందీష్లున్నారు.


