హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు | After Ceasefire Extension Tensions Raise Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

Apr 22 2026 2:37 PM | Updated on Apr 22 2026 3:36 PM

After Ceasefire Extension Tensions Raise Strait of Hormuz

పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్‌ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్‌ దాడులకు దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్‌ షిప్‌లపై ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్‌ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్‌, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్‌ నౌకలుగా వాటిని గుర్తించారు. 

తొలుత.. ఈ ఉదయం గ్రీక్‌ ఆపరేటెడ్‌ కంటైనర్‌ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్‌ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై  దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్‌ మీడియా.. హర్ముజ్‌ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్‌ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్‌(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్‌ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్‌.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement