తాడుసహాయంతో నదిని దాటి మరీ విద్యార్థులకు చదువు చెప్పాలనుకున్న ఉపాధ్యాయుల ఉక్కు సంకల్పాన్ని చూసి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో పితోర్ఘర్లోని బ్రిడ్జ్ కూలిపోయింది. పాఠశాలకు, కొందరు టీచర్లు నివాసముంటున్న ప్రాంతానికి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది. అయితే ఎలాగైనా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లాలని జోధ్ సింగ్ కున్వర్తో పాటూ మరో టీచర్ భావించారు