సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటు | Telugu-speaking Indians form association in Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటు

Dec 6 2013 5:39 AM | Updated on Sep 2 2017 1:20 AM

ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు మాట్లాడే వారంతా కలిసి తొలిసారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జడ్డా(తాజ్)గా ఏర్పడ్డారు.

దుబాయ్: ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు మాట్లాడే వారంతా కలిసి తొలిసారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జడ్డా(తాజ్)గా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసమే తామంతా సంఘంగా ఏర్పడినట్టు తాజ్ అధ్యక్షుడు మస్తాన్ షేక్ అరబ్ న్యూస్‌కు వెల్లడించారు. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వారంతా కలిసి తాజ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సౌదీలో దాదాపు 4 లక్షల మంది తెలుగువారు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న నేపథ్యంలో తాజ్ ఏర్పాటు సర్వత్రా ఆసక్తిగా మారింది.
 

Advertisement
 
Advertisement
Advertisement