
'మేలు చేస్తే పొగుడుతా.. కీడు చేస్తే నిలదీస్తా'
ప్రజలకు మేలు చేస్తే పొగుడుతానని.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ప్రజల పక్షాన ప్రభుత్వా న్ని నిలదీస్తానని తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పాలకుర్తి: ప్రజలకు మేలు చేస్తే పొగుడుతానని.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ప్రజల పక్షాన ప్రభుత్వా న్ని నిలదీస్తానని తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట భోజనం కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ ఆహారభద్రత కార్డులు, పింఛన్ల కోసం అర్హులైన వారు ఇంకా మిగిలి ఉన్నారన్నారు. భర్త వదిలేసిన మహిళలకు కూడా పింఛన్లు అందించాలని కోరారు. రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని, వారంతా సంక్షేమ పథకాలకు అర్హులేనని ఆయన పేర్కొన్నారు.