
అలా చూడాల్సి రావడం బాధగా ఉంది: సెహ్వాగ్
యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో సైనికులు కోల్పోవడంపై కలచివేసిందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో సైనికులు కోల్పోవడంపై కలచివేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. యూరిపై ఉగ్రదాడి గురించి తెలియగానే తన గుండె పగిలినంతపనైందని వ్యాఖ్యానించాడు. దాడికి తెగబడిన వారు తిరుబాటుదారులు కాదని, ఉగ్రవాదులని అన్నాడు. ఉగ్రవాదానికి తగినవిధంగా సమాధానం చెప్పాలని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం చాలా బాధకరమని అన్నాడు. సైనికులకు కుటుంబం, పిల్లలు ఉంటారని వారిని ఈ విధంగా చూడాల్సి రావడం కలచివేస్తుందని ట్వీట్ చేశాడు. అమర జవాన్ల మృతదేహాలతో కూడిన శవపేటికల ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
17 lives.
— Virender Sehwag (@virendersehwag) 19 September 2016
They had a family,they had a son,they had a daughter.
They were serving our motherland.
Pains to see this. pic.twitter.com/65WeRRhgI5