న్యూఢిల్లీ: దేశంలో న్యాయస్థానాల ముందు పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉంది. ఏళ్లకు ఏళ్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే విస్తుపోవాల్సిందే. సివిల్, క్రిమినల్ కేసుల వారీగా విచారణ పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది.
సుప్రీంకోర్టులోనూ భారీగా పెండింగ్..
2016 ఫిబ్రవరి 19 వరకు తన ముందున్న పెండింగ్ కేసు వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. 48,418 సివిల్ కేసులు, 11,050 క్రిమినల్ కేసులు తన విచారణ కోసం నిరీక్షిస్తున్నట్టు తెలిపింది. 19-2-2016 నాటికి పదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ కేటగిరీలో 1,132, క్రిమినల్ కేటగిరీలో 84 ఉన్నాయని తెలిపింది. గత మూడేళ్ల కాలంలో తాము పరిష్కరించిన కేసుల సంఖ్యను కూడా సుప్రీంకోర్టు ఈ వివరాల్లో వెల్లడించింది. 2013లో 40,189 కేసులు, 2014లో 45,042 కేసులు, 2015లో 47,424 కేసులు, ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరి 19 వరకు 6,054 కేసులు పరిష్కరించినట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
హైకోర్టులోన్లూ..
ఇక హైకోర్టుల విషయానికొస్తే.. 2014 డిసెంబర్ 31వరకు 31,16,492 కేసులు సివిల్ కేటగిరీలో, 10,37,465 కేసులు క్రిమినల్ కేటగిరీలో పెండింగ్ లో ఉన్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి పదేళ్లకు పైగా విచారణ పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ కేటగిరీలో 5,89,631, క్రిమినల్ కేటగిరీలో 1,87,999 కేసులు ఉన్నాయి..
జిల్లా, సబార్డినేట్ న్యాయస్థానాల్లోనూ..
డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లోనూ చాలా కేసులు పరిష్కారం కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో పెండింగ్ కేసులో సివిల్ కేటగిరీలో 82,34,281, క్రిమినల్ కేటగిరీలో 1,82,54,124 కేసులు ఉన్నాయి. ఇక పదేళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న కేసులు ఈ న్యాయస్థానాల ముందు సివిల్ కేటగిరీలో 6,11,658, క్రిమినల్ కేటగిరీలో 14,32,079 కేసులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 2012 నుంచి 2014 వరకు పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 2012లో 66,130, 2013లో 58,278, 2014లో 66,239 కేసులను ఉమ్మడి హైకోర్టు పరిష్కరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టులు 2012లో 6,06,447 కేసులు, 2013లో 5,14,867 కేసులు, 2014లో 6,47,130 కేసులను పరిష్కరించాయి.
గుట్టలు గుట్టలుగా పెండింగ్ కేసులు!
Published Thu, Mar 3 2016 6:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
కేరళలో విజృంభిస్తున్న వెస్ట్ నైలు జ్వరం కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement