‘గాంధీ జాతిపిత కాదు.. ఈ దేశం కన్న బిడ్డ’ | Bhopal MP Sadhvi Pragya Calls Mahatma Gandhi Son of the Nation | Sakshi
Sakshi News home page

గాంధీ జాతిపిత కాదు.. ఈ దేశం కన్న బిడ్డ : సాధ్వీ ప్రజ్ఞా

Oct 21 2019 1:37 PM | Updated on Oct 21 2019 1:59 PM

Bhopal MP Sadhvi Pragya Calls Mahatma Gandhi Son of the Nation - Sakshi

భోపాల్‌ : హిందుత్వ భావజాలంతో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మరోమారు వార్తల్లో నిలిచారు. భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే, బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరెందుకు పాల్గొనడం లేదన్న మీడియా ప్రశ్నకు.. ‘గాంధీ జాతిపిత కాదు. ఈ దేశం కన్న గొప్ప బిడ్డ. ఈ దేశం కోసం కష్టపడ్డారు. అందుకు మేం ప్రశంసిస్తాం. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాం. ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’అని సూటిగా సమాధానమిచ్చారు.

కాగా, ప్రజ్ఞాసింగ్‌ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నాయకత్వం ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలని ఆదేశించింది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల ఆమెకు ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఎదురవలేదు. భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై ఆమె భారీ మెజార్టీతో గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement