దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి గడువు పెంపు | osmania university distance education courses fee | Sakshi
Sakshi News home page

దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి గడువు పెంపు

Feb 1 2017 12:56 PM | Updated on Sep 5 2017 2:39 AM

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి గడువు పెంచారు.

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీ ఆర్‌ఆర్‌సీడీఈ) పరిధిలోని వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యూజీ, పీజీ, పీడీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement