కరీంనగర్ జిల్లా రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మరిది కందుల సత్తయ్య(40) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు.
కరీంనగర్ జిల్లా రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మరిది కందుల సత్తయ్య(40) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు. మంచిర్యాల గోదావరి ఒడ్డున బుధవారం జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన సత్తయ్య తిరిగి వస్తుండగా నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని రక్షించడానికి ప్రయత్నించేలోపే నీట మునిగి మృతిచెందాడు.