నేడు పెన్షనర్స్ డే
కొరిటెపాడు (గుంటూరు) : తలపండిన అనుభవం.. తలపడే ఉత్సాహం.. అనుభవాల పరవళ్లు.. అనుబంధాల సందళ్లు ఒకేచోట కావాలంటే అది కేవలం పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఇంట్లోనే కనిపిస్తాయి. జీవితాంతం ఎన్నో కష్టాలు పడి ముదిమి వయస్సులో మనుమలు, మనవరాళ్లతో ఆనందంగా గడిపే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఒక వ్యక్తి ఉద్యోగపరంగా సేవలు అందించి.. ఉద్యోగ విరమణ తర్వాత అతను అందుకునే జీవనాధారమే ఇది. అందుకే ఈ పెన్షన్ సేవలకు ప్రభుత్వం కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పించింది. ఇందులో భాగంగానే 1871వ సంవత్సరంలో దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ చట్టాన్ని తెచ్చారు.ఈ చట్టం జారీ అయిన డిసెంబర్ 17వ తేదీనే పెన్షనర్స్ డేగా జరుపుకొంటున్నారు.
పెన్షనర్ల పెద్ద మనసు
నేటి పెన్షనర్లు అసోసియేషన్లుగా ఏర్పడి సమాజ సేవలో పాల్గొంటున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పదుల సంఖ్యలో పెన్షనర్ల అసోసియేషన్లు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, పాఠశాలల్లో మౌలిక వసతులు, మురికివాడల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. అయితే, పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఆర్థికపరమైన భద్రత కల్పించడంతో పాటు వారు చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
కంట్రిబ్యూషన్ పెన్షన్ విచారకరం
పెన్షన్ అనేది కేవలం ఉద్యోగి చేసిన సేవకు చెల్లించే జీవనాధారమే కాదు. వయోభారంతో రోజురోజుకూ కుంగిపోవడమే కాకుండా శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని కల్పిస్తున్న ఆర్థిక, భద్రతా చర్య. అయితే, నాటి పాలకులు భవిష్యత్తుకు భరోసా ఇస్తే నేటి పాలకులు కంట్రిబ్యూటర్ పెన్షన్ తేవడం ద్వారా భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పదేళ్లు అయినా దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం నిర్ణయించలేని అయోమయ స్థితిలో ఉందన్నారు. ఇది విచారకరం. పెన్షన్ మంజూరులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- ఈదర వీరయ్య, పెన్షన్దారుల చర్చావేదిక అధ్యక్షుడు
నేడు వయోవృద్ధులకు సన్మానం
విజయవాడ (పటమట) : పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75ఏళ్లు దాటిన 14మంది వయోవృద్ధులను సన్మానిస్తున్నట్లు అసోసియేషన్ నగర కార్యదర్శి కేఎస్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 1980వ సంవత్సరంలో పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలపై డీఎస్ నగారా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి గెలిచారని, అప్పటి నుంచి పెన్షనర్లు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. పెన్షనర్స్ డే రోజున ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొంటారని ఆయన వివరించారు.
ముదిమి వయస్సులో జీవనాధారం
స్వాతంత్య్రానంతరం పౌరసేవలను విస్తృత పరచిన క్రమంలో పెన్షన్ చట్టానికి మరింత స్పష్టత వచ్చింది. దీనిని సామాజిక భద్రతకు సంబంధించిన అంశంగా భావించి.. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ప్రజలకు అందించిన అమూల్య సేవలకు గుర్తింపుగా పొందుతున్న అత్య వసర జీవనాధారంగా దీనిని పరిగణించింది. నేటి పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పెన్షనర్ల భవితను అంధకారంలోకి నెట్టారు.
ఆర్థిక ఆసరా..
Published Thu, Dec 17 2015 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement