‘తెలంగాణ ప్రజలను తొమ్మిదేళ్లుగా వంచించి, వురణాలకు కారణమైనందుకా ఇపుడు మంత్రుల జైత్రయాత్రలు?’ అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రజలను తొమ్మిదేళ్లుగా వంచించి, వురణాలకు కారణమైనందుకా ఇపుడు మంత్రుల జైత్రయాత్రలు?’ అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశ్నించారు. జైత్రయూత్ర తెలంగాణ ప్రజలపై దండయాత్రగా అభివర్ణించారు. బీజేపీ నేతలు నారాయణస్వామి నాయుడు, ఉమా, కృష్ణమనాయుడుతో కలిసి కిషన్రెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు, వేధిం పులు, బలిదానాలకు కాంగ్రెసే కారణమని తెలిసినా, సిగ్గులేకుండా జైత్రయాత్రలు చేస్తున్నారన్నారు. కాగా, ఉత్తరఖాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చిత్తూరు జిల్లా సైనికుడు కె.వినాయకన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5లక్షల చెక్కును కిషన్రెడ్డి అందించారు.