ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్కు ముప్పు పొంచివుందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యునల్లోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్కు నోటీసులు జారీ చేసింది.