రెండు బండరాళ్ల మధ్య చితికిపోయిన చిన్నారి


రాజుపాలెం : వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం తొండలదిన్నెలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంటి ముందున్న స్థలంలో రెండు బండరాళ్ల మధ్య ఊయల ఊగుతున్న హనీఫా అనే నాలుగేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తూ బండరాళ్లు  పడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఊయల ఊపుతున్న చిన్నారి అన్నలు షఫీ(6), మహబూబ్‌బాషా(12)లు ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద  సమయంలో చిన్నారుల తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top