హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్గుప్తాతో సీఎం కిరణ్ భేటీ
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ సుదీర్ధ సమావేశం జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్గుప్తాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ సుదీర్ధ సమావేశం జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్గుప్తాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గత కొద్దికాలంగా అసంతృప్తితో రగులుతున్న ముఖ్యమంత్రి కీలక సమయంలో గుప్తాతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. కేంద్ర కెబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే తలెత్తే పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.