Congress Party: టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. కోమటిరెడ్డికి..?

AICC announced TPCC Committees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. ఇక టీపీసీసీ కమిటీలలో ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానం శనివారం అధికారికంగా ప్రకటించింది. 

టీపీసీసీ కమిటీలు
►పొలిటికల్ అఫైర్స్ కమిటీ -18మంది
►వర్కింగ్ ప్రెసిడెంట్స్ - 04
►జిల్లా అధ్యక్షులు - 26 మంది
►వైస్ ప్రెసిడెంట్స్- 24 మంది
►జనరల్ సెక్రటరీ- 8 మంది

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ నియమించిన కాంగ్రెస్ అధిష్టానం
 1.మాణికం ఠాగూర్ ( చైర్మన్)
 2.  రేవంత్ రెడ్డి
 3. మల్లు భట్టి విక్రమార్క
 4. వి.హనుమంత రావు
 5. పొన్నాల లక్ష్మయ్య
 6. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
 7. కె. జానా రెడ్డి
 8. టి. జీవన్ రెడ్డి
 9. డా.జె.  గీతారెడ్డి
 10. మహమ్మద్ అలీ షబ్బీర్
 11. దామోదర్ సి రాజా నరసింహ
12. రేణుకా చౌదరి
 13. పి. బలరాం నాయక్
 14. మధు యాష్కీ గౌడ్
 15.  చిన్నా రెడ్డి
 16.  శ్రీధర్ బాబు
 17. వంశీ చంద్ రెడ్డి
 18. సంపత్ కుమార్

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు రాజకీయ వ్యవహారాల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు
 1. ఎండీ అజారుద్దీన్
 2. అంజన్ కుమార్ యాదవ్
 3.  జగ్గా రెడ్డి
 4. మహేష్ కుమార్ గౌడ్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top