మనుషుల మధ్య ఎన్నో బంధాలు ఉంటాయి.. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా కేవలం మానవత్వంతో రక్త బంధాన్ని ఏర్పరుచుకునేవారే రక్తదాతలు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి ఏటా రెండు నుంచి మూడుసార్లు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ.. మరణం అంచుల్లో ఉన్నవారికి పునర్జన్మను ఇస్తున్నారు. కొందరు పదులు సంఖ్యలో రక్తదానం చేసి ఎందరికో జీవనదానం చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... – పాలమూరు
– వివరాలు 8లో..


