గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఆదే పథకాన్ని చంద్రబాబు ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేసేందుకు 2024 ఎన్నికల సమయంలో నిర్ణయించారు. 18–59 ఏళ్లలోపు మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం బ్యాంకు అకౌంటుకు జమ చేస్తామని విస్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ నెల 12 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డ నిధి అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టకపోవడం అన్యాయం. – పద్మావతి, వెంకటాపురం, డోన్ మండలం


