జిల్లా కలెక్టర్‌ని కలసిన చీరాల ఆర్డీఓ | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌ని కలసిన చీరాల ఆర్డీఓ

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

జిల్లా కలెక్టర్‌ని కలసిన చీరాల ఆర్డీఓ బాపట్ల: చీరాల రెవెన్యూ డివిజన్‌ అధికారిగా ఎస్‌ నరసింహారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. అనంతరం డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌ను పూల మొక్క అందించారు. అనకాపల్లి జిల్లా ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ బదిలీపై చీరాల ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించడంతో పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. స్కూల్‌ బస్సు బోల్తా నగరం: స్కూల్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని మీసాలవారిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు నగరానికి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ బస్సు మీసాలవారిపాలెం వెళ్తుండగా గ్రామ సమీపంలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి

డీఆర్వో షేఖ్‌ ఖాజావలి

గుంటూరు వెస్ట్‌: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్‌ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)పై ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్‌ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

ఏఆర్‌ ఆర్‌ఐగా కృష్ణయ్య

నగరంపాలెం: జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగపు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా కె.కృష్ణయ్య శుక్రవారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఏఆర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. 2013 బ్యాచ్‌కు చెందిన కె.కృష్ణయ్య గతంలో గుంటూరు హోంగార్డ్స్‌ విభాగం, బీడీ టీమ్‌, ఆక్టోపస్‌ మంగళగిరి, ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ఈ ఏడాదిలో ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొంది, రిపోర్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement