కోనసీమ: ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండాకాలం కావడంతో గోదావరి నది నీళ్లలోకి దిగి స్నానం చేద్దామని వెళ్లారు ముగ్గురు యువకులు. అయితే, అందులోకి దిగిన వెంటనే ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యువకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వారు ముగ్గురు రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆ ముగ్గురు యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమైందని తెలిపారు. మిలిగిన ఇద్దరి కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొసాగుతున్నాయని అన్నారు.


