breaking news
Paetongtarn Shinawatra
-
షినవత్రలాగే.. ఆమె తండ్రి, మేనత్త.. ప్రధాని పదవిని పోగొట్టుకున్నారు
బ్యాంకాక్: థాయ్లాండ్, కంబోడియా సరిహదద్దు వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినప్పటికీ థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కు ఫోన్ చేశారు.ఫోన్లో అంకుల్.. మా ఆర్మీ కమాండర్ నామాట వినడం లేదు. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. థాయ్లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది. ఇలా అతిచిన్న వయస్సులో దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షినవత్ర.. పదవిని కోల్పోవడం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో షినవత్రతో పాటు ఆమె తండ్రి థాక్సిన్ షినవత్ర ,మేనత్త యింగ్లక్ షినవత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షినవత్ర ఎలా అర్ధాంతరంగా పదవి పోగొట్టుకున్నారో తండ్రి,మేనత్తలు కూడా థాయ్లాండ్ ప్రధానులుగా పనిచేస్తుండగానే కోర్టు తీర్పు కారణంగా పదవీచిత్యులయ్యారు.షినవత్ర కుటుంబం థాయ్లాండ్ రాజకీయాల్లో శక్తివంతమైన కుటుంబం.వివాదాస్పదమైన వంశం. ఈ కుటుంబానికి చెందిన ఆరు ప్రధానులు గత 20 సంవత్సరాల్లో సైనిక తిరుగుబాట్లు, న్యాయస్థానాల తీర్పుల ద్వారా పదవుల నుంచి తొలగించబడ్డారు.తండ్రి థాక్సిన్ షినవత్ర థాక్సిన్ షినవత్ర 2001–2006 థాయ్లాండ్ ప్రధానిగా పనిచేశారు.2006లో సైనిక తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోయారు. ఆయనపై అవినీతి, అధికార దుర్వినియోగం,రాజ్యానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. తిరుగుబాటు సమయంలో ఆయన విదేశాల్లో ఉండగా, తిరిగి రావడం కష్టమైంది.తర్వాత విదేశాల్లో తలదాచుకున్నారుమేనత్త యింగ్లక్ షినవత్ర యింగ్లక్ షినవత్ర 2011–2014 మధ్య కాలంలో థాయ్లాండ్ ప్రధానిగా పని చేశారు. ఆమె రైస్ సబ్సిడీ స్కీమ్లో ఆర్థిక అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. విచారణ చేపట్టిన థాయ్లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం 2014లో ప్రధాని పదవి నుంచి యింగ్లక్కు ఉద్వాసన పలికింది. రాజ్యాంగ న్యాయస్థానం తీర్పువెలువడిన వెంటనే ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది.ప్రభుత్వం కుప్పకూలింది. వెంటనే ఆమె దేశం వదిలి వెళ్లిపోయారు.పెహూ తై పార్టీ ద్వారా ప్రజాదరణ పొందిన పాలనను కొనసాగించేందుకు షినవత్ర కుటుంబం ప్రయత్నించింది. కానీ సైనిక తిరుగుబాటు,అవినీతి ఆరోపణలు షినవత్ర వంశం ప్రతిష్టను దెబ్బతీవాయి. తాజాగా, షినవత్ర సైతం ఒక్క ఫోన్ కాల్తో ప్రధాని పదవికి రాజీనామా చేసి రాజకీయ నిరుద్యోగిగా మిగలాల్సి వచ్చింది. -
థాయ్లాండ్ ప్రధాని పాయ్టోంగ్టార్న్ షినవత్రకు షాక్
-
ఫోన్లో అంకుల్ అన్నది.. సారీ చెప్పింది.. ఆపై ప్రధాని పీఠం నుంచి దిగిపోయింది (చిత్రాలు)
-
థాయ్ ప్రధాని షినవత్రా డిస్మిస్
బ్యాంకాక్: నైతిక ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై సస్పెండయిన థాయ్లాండ్ ప్రధానమంత్రి పెటొంగ్టర్న్ షినవత్రా(39)ను రాజ్యాంగ న్యాయస్థానం ఆ పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది. కోట్లకు పడగలెత్తిన షినవత్రాల కుటుంబ రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ మాత్రమే కాదు, దేశం మరోసారి రాజకీయ సంక్షోభంలో చిక్కుకునేందుకు ఈ పరిణామం దారి తీయనుందని పరిశీలకులు అంటున్నారు. అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షినవత్రా ఏడాది కాలం మాత్రమే అధికారంలో ఉన్నారు. కాంబోడియాతో తలెత్తిన సరిహద్దు వివాదం నేపథ్యంలో జూన్లో ఆ దేశ మాజీ నేత హున్ సెన్తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కడం తీవ్ర సంచలనం రేపింది. షినవత్రా క్షమాపణ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో, ఆమె వైదొలగి ఉపప్రధానికి ఫుమ్తమ్కు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం తాజాగా ఆమెను బర్తరఫ్ చేస్తూ శుక్రవారం చేస్తూ ఆదేశాలిచ్చింది. హున్ సెన్ను అంకుల్ అని సంబోధించడం, థాయ్ ఆర్మీ కమాండర్లను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. కాంబోడియా నేతతో జరిపిన సంభాషణ పెటొంగ్టర్న్ విశ్వసనీయతపై అనుమానాలొచ్చేలా ఉందని, ఆమె హోదాకు సరైంది కాదని తీర్పులో పేర్కొంది. ఆమె తీరు థాయ్లాండ్ కంటే కాంబోడియాకే అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కాగా, థాయ్లాండ్లో గత 17 ఏళ్లలో రాజ్యాంగ కోర్టు వేటేసిన ఐదో ప్రధాని షినవత్రా కావడం గమనార్హం. పెటొంగ్టర్న్ షినవత్రా తండ్రి సీనియర్ నేత థక్సిన్ షినవత్రా సైతం గతంలో ప్రధాని పదవిని కోల్పోయిన వారే. తాజా పరిణామంతో షినవత్రాకు చెందిన ఫ్యు థాయ్ పార్టీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంప్రదాయ వాదులు, పలుకుబడి కలిగిన రాచరిక అనుకూల సైనిక నేతలతో ఎన్నికైన ప్రభుత్వాలు గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఉప ప్రధాని ఫుమ్తమ్, ఆయన కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే, ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం గమనార్హం. ప్రధానమంత్రి పదవికి ఫ్యు థాయ్ పార్టీకి చెందిన 77 ఏళ్ల ఛయ్కసెమ్ నితిసిరితోపాటు ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు అర్హులని చెబుతున్నారు. అన్ని పార్టీలు కూడా తమ సొంత రాజకీయ అవసరాల కోసం యత్నిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు అంత సులువుగా అయ్యే పని కాదన్నది విశ్లేషకుల మాట. థాయ్లాండ్ రాజ్యాంగ కోర్టు గత 17 ఏళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను తొలగించిందని తెలుసా?. ఆ జాబితాను పరిశీలిస్తే.. థాక్సిన్ షినవత్ర (2006).. బలవంతపు పదవీ విరమణ. సైనిక తిరుగుబాటు తర్వాత కోర్టు ద్వారా అనర్హత వేటు. అయితే కోర్టు విచారణ ఎదుర్కొన్న సమయంలోనూ ప్రధాని పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి కూడా ఈయనే. సమక్ సుందరవేజ్ (2008).. ఓ ప్రముఖ ఛానెల్ కుకింగ్ షోలో పాల్గొన్నారు. దీంతో నైతిక ఉల్లంఘన పేరిట కోర్టు ఆయన్ని తొలగించింది. యింగ్లక్ షినవత్ర (2014).. ధాన్యం సబ్సిడీ స్కీమ్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో నైతిక ఉల్లంఘనలపై కోర్టు తీర్పుతో పదవి కోల్పోయారు. స్రేత్థా థావిసిన్ (2024).. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారని ఏడాది తిరగకుండానే కోర్టు ఆయన్ని తొలగించిందిపాయెతోంగ్తార్న్ షినవత్ర (2025). కంబోడియా నేత హున్ సెన్తో లీకైన ఫోన్ సంభాషణలో "అంకుల్" అని సంబోధించడం, థాయ్ సైనికాధికారిని "ప్రతిద్వంది"గా పేర్కొనడం వల్ల నైతిక ఉల్లంఘనగా కోర్టు అభిప్రాయంతో పదవి కోల్పోయారు. -
థాయిలాండ్లో ఒకేఒక్కడు !
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అంటూ కథానాయకుడికి సవాల్ విసరడం, సవాల్ను అంతేవేగంగా స్వీకరించి అర్జున్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మెరుపువేగంతో పరిపాలనను చక్కదిద్దడం సినిమాలో చూశాం. సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనూహ్య ఘటనకు ఇప్పుడు థాయిలాండ్ రాజకీయం వేదికైంది. కాంబోడియా ప్రధాని హున్సేన్తో ఫోన్ సంభాషణలో అతివినయం ప్రదర్శిస్తూ సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను మంగళవారం దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది. రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే రవాణా మంత్రి సూర్య జుగ్రూంగ్రియాంగ్కిట్ను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగుతారని స్పష్టంచేసింది. దీంతో ఒక్క రోజు ప్రధాని అంశం మంగళవారం యావత్ థాయిలాండ్లో చర్చనీయాంశమైంది. ఒక్కరోజు లో కొత్త ప్రధాని ఏమేం బాధ్యతలు నెరవేర్చుతారు?. ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఈ విస్తృత చర్చల నడుమే సూర్య బుధవారం ఉదయం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికే ఉపప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకు ఇప్పుడీ ప్రధాని బాధ్యతలు అదనం. బుధవారం బ్యాంకాక్ నగరంలో ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవంలో సూర్య పాల్గొని తొలి అధికార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీసం 93 గంటలుకూడా ప్రధాని కార్యాలయంలో గడిపే అవకాశంలేని నేత ఏకంగా ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవాన్ని ప్రారంభించారని విపక్ష పార్టీలు ఎద్దేవాచేశాయి. 24 గంటల్లో వ్యవస్థలోని అవినీతినంతా ఈయన ప్రక్షాళన చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు. -
బ్యూటీఫుల్ ప్రధానికి బిగ్ షాక్
థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు భారీ షాక్ తగిలింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో.. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 7-2 మెజారిటీ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇవాళ( జులై 2) నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఇచ్చేంతవరకు ఆమెను ప్రధాని విధుల సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. తీర్పుపై షినవత్రా స్పందిస్తూ.. తన విధులకు అంతరాయం కలగకూడదని తాను కోరుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అంగీకరిస్తానంటూ చెప్పుకొచ్చారు.థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.థాయ్లాండ్కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ను ఉద్దేశించి తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది. -
క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్ ప్రధాని
థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్ సంభాషణ బయటకు..థాయ్లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్లాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.