రైలు కిందపడి 30 గొర్రెలు మృతి | 30 sheeps killed in nizamabad due to cross railway track | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి 30 గొర్రెలు మృతి

Aug 5 2015 12:00 PM | Updated on Sep 3 2017 6:50 AM

ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి.

నిజామాబాద్ :  ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిడ్డ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ గొర్రె రైలు పట్టాలు దాటడంతో మిగతా గొర్రెలు కూడా రైలు వచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గొర్రెల యజమాని బండారు వీరయ్య తెలిపారు. గొర్రెల మృతితో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement