మహిళా ఫిజియోథెరపిస్టుపై లైంగిక దాడికి పాల్పడిన అమెరికాకు చెందిన ఉబర్ క్యాబ్ డ్రైవర్పై బుధవారం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: మహిళా ఫిజియోథెరపిస్టుపై లైంగిక దాడికి పాల్పడిన అమెరికాకు చెందిన ఉబర్ క్యాబ్ డ్రైవర్పై బుధవారం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు శివకుమార్ యాదవ్పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ మాలిక్ 100 పేజీల చార్జిషీట్ను పరిశీలించనున్నారు. అప్పటి వరకూ నిందితుడి జ్యుడిషియల్ కస్టడీని జనవరి 2 వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి 44 మందిని సాక్షులను విచారించినట్లు కేసు దర్యాప్తు పోలీసు అధికారి పేర్కొన్నారు. ఫోర్సెనిక్ నివేదిక, కారులో సంఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన రూట్మ్యాప్ను కూడా జతపర్చినట్లు చెప్పారు.
డైవర్ మహిళను తీసుకెళ్లిన తర్వాత 2.30 గంటల వరకు క్యాబ్లోనే గడిపినట్లు పోలీసులు తెలిపారు. 13 రోజులు జడిషియల్ కస్టడి పూర్తి అయిన తర్వాత ముఖం మీద మాస్కును తొలగించాలని నిందితుడు యాదవ్ మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశాడు. విచారణలో నిందితుడి భార్య కూడా పాల్గొంది. బాధిత మహిళ ఉత్తర ఢిల్లీలోని ఇందర్లోక్ పార్కులో ఉంటూ గుర్గావ్లోని ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. డిసెంబర్ 5వ తేదీన రాత్రి యువతి ఇంటికొచ్చే క్రమంలో కారులోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని మధురలో డిసెంబర్ 7వ తేదీన అరెస్టు చేశారు. 8వ తేదీన నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు దర్యాప్తు పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.