హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు | hyderabad got mixed results | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు

Feb 5 2017 11:01 AM | Updated on Sep 4 2018 5:07 PM

సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బాలుర జట్టు గెలుపొందగా... బాలికల జట్టుకు పరాజయం ఎదురైంది. బాలుర విభాగంలో హైదరాబాద్ 15-6, 15-4తో మెదక్ జట్టుపై, ఆదిలాబాద్ 15-12, 15-8తో మహబూబ్‌నగర్ జట్టుపై, వరంగల్ 15-9, 15-6తో నల్లగొండ జట్టుపై, రంగారెడ్డి 15-1, 15-7తో ఖమ్మంపై విజయం సాధించాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 12-15, 11-15తో నిజామాబాద్ చేతిలో ఓటమి పాలవగా... వరంగల్ 15-9, 15-6తో నల్లగొండపై, ఖమ్మం 15-8, 15-9తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి.


 అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు టి. అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) ప్రిన్సిపల్ పద్మ జ్యోతి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్మోహన్, ప్రభుత్వ హైస్కూల్, బండ్లగూడ హెడ్‌మాస్టర్ శ్రీనివాసరావు, శాట్స్ అబ్జర్వర్ హరినాథ్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement