మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి నమోదైన 300కు పైగా కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.
మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి నమోదైన 300కు పైగా కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. పుణెకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
సుప్రీం కోర్టు అందించిన సమాచారం మేరకు మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు పాల్పడం వంటి సంఘటనలకు సంబంధించి మొత్తం 325 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక కిడ్నాప్ తదితర కేసులు 403 దాకా పెండింగ్లో ఉన్నట్టు పేర్కొంది. అవినీతి, విడాకులకు సంబంధించి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కాగా అన్నింటికంటే అధికంగా భూవివాదాలకు సంబంధించి 8,490 కేసులు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయి.