యువకుడి పోరాటం | Sakshi
Sakshi News home page

యువకుడి పోరాటం

Published Sun, Jul 29 2018 12:44 AM

nee oohallo ne unta relesing shortly - Sakshi

మనోజ్‌ కోడూరు, పర్లి భారతి జంటగా నటించిన చిత్రం ‘నీ ఊహల్లో నే ఉంటా’. పురందర్‌ దాస్‌.కె స్వీయ దర్శకత్వంలో కె.పి.ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత పురంధర్‌ దాస్‌.కె మాట్లాడుతూ –‘‘తన మిత్రులకు జరిగిన అన్యాయంపై ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేసాడన్నది కథాంశం.

యాక్షన్‌తో పాటు వినోదానికి పెద్ద పీట వేశాం. పగ నేపథ్యంలో రూపొందిన చక్కని ప్రేమ కథ ఇది. అంతా కొత్త వాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. గోపాల్‌ పావగాడ, సంధ్య, శ్రావణి, ఆది మామిళ్ల, హిందూనాథ్, మంజునాధ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.కె.ఎం షరీఫ్, సంగీతం: రాజ్‌ కిరణ్, నిర్మాణ సారధ్యం: మధులత.

Advertisement

తప్పక చదవండి

Advertisement