ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం | Tammineni Veerabhadram takes on MIM leaders | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం

Feb 3 2016 6:31 AM | Updated on Aug 13 2018 8:10 PM

ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం - Sakshi

ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వివిధ డివిజన్లలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు, సంతోష్ నగర్‌లో సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వివిధ డివిజన్లలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు, సంతోష్ నగర్‌లో సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

పాతబస్తీని ఎంఐఎం తన సామ్రాజ్యంగా భావిస్తూ రౌడీయిజం చేస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement