పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ | kcr meeting with party leaders | Sakshi
Sakshi News home page

పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ

May 16 2014 1:07 AM | Updated on Aug 29 2018 8:56 PM

టీఆర్‌ఎస్‌కు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమీక్షించడానికి వీలుగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమీక్షించడానికి వీలుగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఫలితాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా కౌంటింగ్ కేంద్రాల వద్దనే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్, రామలక్ష్మణ్ వంటి వారిని ఉదయమే తన వద్దకు రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement