ప్లాట్ల తారుమారు పై సీఆర్డీఏ అధికారులను రైతులు నిలదీశారు.
అమరావతి: ప్లాట్ల తారుమారు పై సీఆర్డీఏ అధికారులను రైతులు నిలదీశారు. టీడీపీ నేతలకు లబ్ధి చేకూరేలా ప్లాట్ల కేటాయింపులకు అధికారులు ప్లాన్ చేశారు. శాకమూరులో ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు తారుమారు చేశారు. లాటరీలో వచ్చిన 1290 బ్లాక్ నుంచి రోడ్డు పక్కనే ఉన్న 584 బ్లాక్కు ప్లాట్లను మార్చారు. టీడీపీ నేతలు తరిగొప్పుల సాంబశివరావు, సత్యనారాయణ, ధూళిపాళ్ల ఉమాదేవి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్లాట్లు మార్చారని రైతులు మండిపడుతున్నారు.