
విజయనగరం , పాలకోడేరు: అతనొక పోలీస్ కానిస్టేబుల్ ఫేస్బుక్లో ఓ మహిళతో పరి చయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆనక ము ఖం చాటేశాడు. దీంతో ఆ అమ్మాయి ఎస్పీని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే పాలకోడేరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న డి.రమేష్ విజయనగరం జిల్లాకు చెందిన బి.ప్రసన్న ఫేస్బుక్లో పరిచయమయ్యా రు. అది ప్రేమగా మారింది. ఆ యు వతి అనేకసార్లు పాలకోడేరు వచ్చి రమేష్ను కలుసుకుంది.
ఈ సంగతి యువతి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఆమె రమేష్పై ఒత్తిడి చేసింది. కానీ రమేష్ ముఖం చాటేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో సోమవారం ఆ యువతి ఎస్పీ రవిప్రకాష్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా తరచూ ఫోన్ చేసేదని తెలిపారు. అయితే ఆ యువతి గతంలో పెళ్లయి విడాకులు తీసుకుందని, అందుకే ఆమె గురించి పట్టించుకోవడం మానేశానని రమేష్ చెప్పినట్టు ఎస్సై వివరించారు.