చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీరు | 15 acres land damaged with heavy floating water | Sakshi
Sakshi News home page

చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీరు

Sep 20 2015 4:45 PM | Updated on Sep 17 2018 8:02 PM

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని కట్టలవాగు చెరువుకు ఆదివారం గండిపడింది.

రేగిడి: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని కట్టలవాగు చెరువుకు ఆదివారం గండిపడింది. భారీ వర్షానికి చెరువు కట్ట కోతకు గురి కావడంతో దాని దిగువ ప్రాంతాల పొలాల్లోకి నీరు భారీగా చేరుతోంది. సుమారు 15 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల కట్టలు దెబ్బతింటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement