ఆకాశంలో శివుడు.. మన కోసం వస్తున్నాడు: డీఎస్పీ
కరోనా ఇప్పుడప్పుడే పోయేలా లేదు. ఇప్పటికే ఎంతోమందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి నానాటికీ విజృంభిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఈ మాయదారి రోగం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని పీడ ఎప్పుడు విరగడువుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. "ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి మనల్ని గట్టెక్కించేందుకు తరలి వస్తున్నాడు" అంటూ తన కెమెరాల్లో బంధించిన ఫొటోను షేర్ చేశాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే హ్యాష్ట్యాగ్ను జత చేశాడు. ఈ ఫొటోను చూసిన జనాలు అబ్బురపడిపోతున్నారు. గరళాన్నే కంఠంలో దాచుకున్న ఆ పరమశివుడికి కరోనాను అంతం చేయడం పెద్ద కష్టం కాదని, ఆయన త్వరగా ఆ వ్యాధిని అంతం చేసి అందరినీ కాపాడతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేవుడిని పిలవగానే ప్రత్యక్షమైపోవడానికి ఇది సినిమా కాదు అంటూ వ్యంగ్యంగా సమాధానాలిస్తున్నారు. మొత్తానికి డీఎస్పీ తీసిన ఫొటో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
SHIVA in the SKY..
on the way to save this WORLD frm the PANDEMIC !! 🙏🏻❤️#EeshwaraParameshwara 🎶❤️🙏🏻 pic.twitter.com/C5vkcKkUPr— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 16, 2021