ప్రసూతికి వచ్చిన వారికి ఎక్కువగా రక్తం అవసరం
థలసీమియా చిన్నారులకురక్త నిల్వలు కేటాయింపు
క్యాంపులు, స్వచ్ఛంద దాతలు, రీప్లేస్మెంట్ ద్వారా సేకరణ
రీచార్జి బావుల నిర్మాణంతో
భూగర్భ జలాల పెంపు
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
గన్నవరం రూరల్: రీచార్జి బావుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ముస్తాబాదలో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీచార్జి బావి ఇంజక్షన్ వెల్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. జిల్లాలో భూగర్భజలాలు మట్టాన్ని పెంపొం దించి భవిష్యత్ నీటి అవసరాలకు స్థిరమైన పరిష్కారం అందించే లక్ష్యంతో రీచార్జి బావుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. రీచార్జి బావుల నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు అమలు విధానం నిర్మాణ వ్యయం, భూగర్భ జలాల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు అధికారులతో సమీక్షించారు. ప్రీ మాన్సూన్ కాలంలో భూగర్భ జలం 6 మీటర్లు కంటే లోతుగా ఉన్న గ్రామా లను గుర్తించి రీచార్జి బావుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. జలధార హారతి కార్యక్రమం ద్వారా ఈ ఫైలెట్ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పంటబోదె పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్ కూలీలతో మాట్లాడారు. డ్వామా పీడీ శివప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ గుణకర్, జిల్లా అధికారులు, తహసీల్దార్ కేవీ శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత పాల్గొన్నారు.
రక్తదాత.. స్ఫూర్తిప్రదాత
ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో స్వచ్చంధ రక్తదాతలు, రీప్లేస్మెంట్, క్యాంపుల నిర్వహణ ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. జీజీహెచ్లోని మదర్ బ్లడ్ బ్యాంకులో సేకరించిన రక్తాన్ని ఇక్కడ అవసరమైనన్ని యూనిట్లు వినియోగిస్తూ, అనుబంధంగా ఉన్న పాత ప్రభుత్వాస్పత్రి, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరంలలోని స్టోరేజ్ యూనిట్లు రక్తాన్ని అందిస్తున్నారు. ఐదేళ్లలో జీజీహెచ్ బ్లడ్ బ్యాంకు సేకరించిన యూనిట్లు ఇలా...
కలెక్టర్ డీకే బాలాజీ


