ఆదిలాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మనదేశం 12ఏళ్లుగా అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల అమలులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ నగేశ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో అనేక సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని వివరించా రు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ ముస్తపురేతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


