ముధోల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందిన ట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్ (40), సాయినాథ్ భూమేష్ ఎలక్రీషియన్తో కలిసి మాధవ్నగర్ కాలనీలో శుక్రవారం విద్యుత్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


