20న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

20న జాతీయ లోక్‌అదాలత్‌

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

ఆదిలాబాద్‌టౌన్‌: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉ న్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈనెల 20న జాతీయ లోక్‌ అ దాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రభాకరరా వు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ క్రిమినల్‌ కేసులు, సివిల్‌, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసులను రాజీమార్గం ద్వారా శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమని తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement