ఆదిలాబాద్టౌన్: ఈనెల 7న జిల్లా కేంద్రంలో ని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించను న్న వ్యవసాయ కార్మిక సంఘం నాలుగో జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు పి లు పునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కా రం, సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం కోసం సంఘం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన వీబీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ కార్మిక వ్యతిరేక వి ధానాలపై చర్చించి, వ్యవసాయ కార్మికుల స మస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. నూతన కమిటీని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు స్వా మి, ఉపాధ్యక్షులు ఆశన్న, గంగారాం ఉన్నారు.


