breaking news
Pavithra Gowda
-
రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?
అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. జైల్లోని తోటి ఖైదీలపై చేయి చేసుకున్నాడని రెండు రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇప్పుడు మరో షాకింగ్ ఫొటో వైరల్ అవుతోంది. దర్శన్ హత్య చేసిన రేణుకాస్వామి సమాధి చిత్రదుర్గలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరో ధ్వంసం చేశారు.రేణుకా స్వామి హత్య కేసులో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో సమాధిని ధ్వంసం చేయడం అంటే దర్శన్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఇతడి అభిమానులే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. రేపు(డిసెంబరు 11) దర్శన్ కొత్త సినిమా 'డెవిల్' థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం అభిమానులు ఆ హడావుడిలోనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రేణుకా స్వామి సమాధి ధ్వంసం అయిందని ఒకటి రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.హత్య కేసు సంగతేంటి?హీరో దర్శన్ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారని, దీని వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందనే బాధతో రేణుకాస్వామి అనే యువకుడు.. తన ఇన్స్టాలో పవిత్రని టార్గెట్ చేశాడు. అశ్లీల సందేశాలు, దర్శన్ని విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.ఇదే రేణుకాస్వామి హత్యకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు కన్నడనాట తీవ్ర సంచలనం సృష్టించింది. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో హైకోర్టు దర్శన్కు గతేడాది అక్టోబర్లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాలు చేసింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కనపెడుతూ అత్యున్నత న్యాయస్థానం ఆ బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ దర్శన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో దర్శన్ ఉన్నాడు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు) -
దర్శన్ అండ్ గ్యాంగ్పై 3న తుది చార్జిషీట్
కర్ణాటక రాష్ట్రం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఈ నెల 3న తుది చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది. కేసులో రెండో నిందితుడు నటుడు దర్శన్తో పాటు ఇతర నిందితులను కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ నెల 3న చార్జిషీట్ సమర్పించాలని, ఆరోజు నిందితులు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని జడ్జి అదేశించారు. నిందితులపై పోలీసులు దాఖలు చేసిన ఆరోపణలను న్యాయమూర్తి చదివి వినిపించారు. ఇవి నిజమేనా అని అడిగారు. 9 మంది నిందితులు నేరాన్ని అంగీకరిస్తే సాక్షులను విచారించే అవకాశం ఉంటుంది. చార్జిషీట్ లో దర్శన్పై పోలీసులు ఎలాంటి నేరారోపణ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జైల్లో ఉన్న ఏడు మందితో పాటు కేసులోని 9 మందిపై పోలీసులు చార్జిషీట్ సమర్పించనున్నారు. అయితే కొందరి పేర్లును తొలగించే అవకాశం కూడా ఉంది. గతంలో నిందితులపై చార్జిషీట్ సమర్పించాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. అయితే పీపీ గడువు అడిగారు. దర్శన్ తరపున న్యాయవాది మాత్రం విచారణను ఎదుర్కొని కేసులో గెలిచి బయటకు వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దర్శన్, పవిత్ర గౌడల ఫొటోలు వైరల్ హత్య కేసు నిందితుడు నటుడు దర్శన్, పవిత్రాగౌడలు పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ఎవరో ఈ ఫోటోలను లీక్ చేశారని అనుమానిస్తున్నారు. దర్శన్, పవిత్రలిద్దరూ పెళ్లి బట్టలు ధరించినట్లు, పవిత్ర మెడలో పసువు దారం ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. పవిత్రతో దర్శన్ అన్యోన్యంగా ఉన్నట్లు సెల్ఫీ ఫొటో ఉంది. ఇవి పదేళ్లనాటి ఫొటోలని నెటిజన్లు అంటున్నారు. -
నటి పవిత్ర గౌడ అరెస్ట్
బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు. రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలు పవిత్రా గౌడకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను.. గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో.. పోలీసులు నటి సప్తమిగౌడను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే హత్యకేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ను ఇవాళ సైతం దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ నగర్లో ఉన్న పవిత్రగౌడను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. Kannada actor #DarshanThoogudeepa's friend #PavithraGowda on Thursday was arrested by the #BengaluruPolice after the #SupremeCourt cancelled her bail in connection to the #RenukaswamyMurderCase.pic.twitter.com/dlEovoXxFT https://t.co/y6tgvcfOep— Hate Detector 🔍 (@HateDetectors) August 14, 2025కర్ణాటక హైకోర్టు గతంలో దర్శన్, పవిత్ర గౌడ సహా ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. ఆ పిటిషన్పై గురువారం (ఆగస్టు14) జస్టిస్ జేబీ పార్దివాలా,ఆర్ మహాదేవన్ ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. సెషన్ కోర్టు (కర్ణాటక హైకోర్టు)ఇచ్చిన తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని,ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి చట్టపరమైన కారణం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అదే సమయంలో దర్శన్ తూగదీపకు బెయిల్ ఇస్తే న్యాయ పరిపాలనను పట్టాలు తప్పే ప్రమాదం కలిగిస్తుందని పేర్కొంది. నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. విచారణ త్వరగా జరగాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జైలులో నిందితులకు ప్రత్యేక సౌకర్యాలఉ అందించాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్ ఆర్నగర్లో ఉన్న పవిత్రగౌడను.. మైసూర్లో ఉన్న దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.దర్శన్ వీరాభిమాని రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదే కారణంతో జూన్ 2024లో రేణుకా స్వామిని.. పవిత్ర గౌడతో పాటు దర్శన్ అతని అనుచరులు కిడ్నాప్ చేశారు. బెంగళూరులోని ఒక షెడ్లో మూడు రోజుల పాటు నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. చిత్రహింసలు తాళలేక రేణుకాస్వామి మరణించారు. డెడ్ బాడీని మురికి కాలువలో పడేసి పారిపోయారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. -
దర్శన్, పవిత్ర బెయిలు బంతి.. సుప్రీంకోర్టులో
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటీనటులు దర్శన్, పవిత్రాగౌడ బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిలు రద్దు చేయరాదని ఇరువురి తరఫు వకీళ్లు లిఖితపూర్వకంగా వాదనలను సమర్పించారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. ఇరువైపులా న్యాయవాదుల బలమైన కారణాలను పేర్కొన్నారు. అసలు రేణుకాస్వామిని అపహరించినట్లు, హత్య చేసినట్లు దర్శన్పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన లాయర్లు పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వాదనలు ఇలా ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో.. మృతుడు రేణుకాస్వామి దర్శన్ అభిమాని. దర్శన్ పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నాడని కోపగించి అవహేళన సందేశం పంపాడని రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులో పట్టణగెరె వద్ద ఒక షెడ్డులో హత్య చేశారు. నిందితులందరూ హత్య చేసిన స్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి మట్టి నమూనాలు అందరి పాదరక్షలలోను ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది అంటూ పలు కారణాలను పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. -
'నా మనసుకు ఇంకా గాయం..' మహాకుంభమేళాలో పవిత్ర గౌడ
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆశీర్వాదం..ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.మరింత బాధ, శోకం..మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్పై బహిష్కరణ వేటు -
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్


