చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. తన ఆశలపై సర్వోన్నత న్యాయస్థానం నీళ్లు చల్లడంతో పళనిస్వామిని శశికళ తెరపైకి తెచ్చారు. తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు పోటీగా పళనిస్వామిని నిలిపారు. ఇప్పటివరకు సీఎం పీఠం కోసం శశికళ, సెల్వం మధ్య జరిగిన పోరు ఇప్పుడు పన్నీర్ వర్సెస్ పళనిగా మారింది.
తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న పన్నీర్ సెల్వంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన ‘చిన్నమ్మ’... వెంటనే పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికయేలా చేశారు. తనకు అడ్డుపడిన సెల్వంకు సీఎంగా మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో శశికళ పావులు కదుపుతున్నారు. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీంగా తనను నాయకుడిగా ఎన్నుకున్నారని పళని ప్రకటించారు. అంతేకాదు పార్టీతో పన్నీర్ కు ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం స్వరం మార్చారు. విభేదాలు మర్చిపోయి, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ చీలిపోకుండా చూసుకుందామంటూ బుజ్జగింపులకు దిగారు. మరోవైపు పళనిస్వామికి మార్గం సుగమం చేసేందుకు శశి వర్గం ప్రయత్నిస్తోంది. గవర్నర్ తో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమయింది. పన్నీర్, పళని పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.
పన్నీర్ వర్సెస్ పళని
Published Tue, Feb 14 2017 4:48 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement