దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు | No decision on Good Governance Day yet: Goa | Sakshi
Sakshi News home page

దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

Mar 25 2015 8:51 AM | Updated on Sep 2 2017 11:22 PM

దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

పనాజీ: క్రిస్టమస్ డే రోజునే సుపరిపాలన దినోత్సవంగా పాటించే అంశంపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని గోవా ప్రభుత్వం స్పష్టం చేసింది.

పనాజీ: సుపరిపాలన దినోత్సవంపై ఇంకా తాము ఏ నిర్ణయం తీసుకోలేదని గోవా ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 25 క్రిస్టమస్ డే కాగా, అదే రోజును దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలువురు క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, క్రైస్తవులు అధికంగా ఉండే గోవాలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రతిపక్షాలు దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించగా దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బదులిచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తాము ఇంకా ఏం నిర్ణయించుకోలేదని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement