పెట్రోలుపై ఐదు పైసలు, డీజిల్‌పై రూ. 1.26 పెంపు | Five paise hike on petrol and Rs . 1.26 hike on diesel | Sakshi
Sakshi News home page

పెట్రోలుపై ఐదు పైసలు, డీజిల్‌పై రూ. 1.26 పెంపు

Jun 16 2016 1:48 AM | Updated on Sep 4 2017 2:33 AM

పెట్రోలుపై ఐదు పైసలు, డీజిల్‌పై రూ. 1.26 పెంపు

పెట్రోలుపై ఐదు పైసలు, డీజిల్‌పై రూ. 1.26 పెంపు

పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి.

న్యూఢిల్లీ: పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై ఐదు పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 1.26లు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 65.65, డీజిల్ ధర లీటరుకు 55.19కి చేరాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. మే 1 నుంచి పెట్రో ధరలను నాలుగుసార్లు పెంచారు. అప్పటినుంచి పెట్రోలు రూ. 4.52, డీజిల్ రేటు రూ. 7.72 మేర పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement