సిరియాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో కనీసం 9 మంది విద్యార్థినులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.
డమాస్కస్: సిరియాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో కనీసం 9 మంది విద్యార్థినులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. మంగళవారం దైర్ ఇజోర్లో ఓ బాలికల ఎలిమెంటరీ స్కూల్పై ఉగ్రవాదులు ఫిరంగులతో దాడి చేశారు.
దైర్ ఇజోర్లో ప్రభుత్వ బలగాలు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మధ్య పోరు సాగుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్కూల్ పై దాడికి పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.