హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద కేసు | ISIS module case: NIA files charge sheet against eight people in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద కేసు

Dec 22 2016 8:54 PM | Updated on Oct 17 2018 5:14 PM

హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద కేసు - Sakshi

హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద కేసు

హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాదులపై కేసు నమోదైంది.

న్యూ ఢిల్లీ:
హైదరాబాద్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాదులపై కేసు నమోదైంది. 8మంది పై ఎన్ఐఏ చార్జ్ షీటు దాఖలు చేసింది. అబ్దుల్ బిన్ అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అబీబ్ మహ్మద్, ఇలియన్ యద్జానీ, ముసఫర్ హుస్సేన్, యాసిర్ అహ్మతుల్లా, అతావుల్లా రెహ్మాన్ పై చార్జ్ షీటు దాఖలు చేశారు.

వీరు ధార్మిక స్థలాల్లో బాంబులు అమర్చేందుకు కుట్రపన్నారని, ఐసిస్ అగ్రనేతలతో సంభాషణలు జరిపినట్టు ఎన్ఐఏ పేర్కొంది. వీరందరు ఐసిస్ ఉగ్రవాద చర్యల్లో భాగస్వాములని చార్జ్ షీటులో ఎన్ఐఏ తెలిపింది. సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పేలుడు పదార్థాలు, సాహిత్యం, వీడియోల వివరాలను చార్జ్ షీటులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement